నిర్మల్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని మాజీమంత్రి అల్లుళ్ల ఇంద్రకరణ్ రెడ్డి సోమవారం సందర్శించారు. ఆదివారం అగ్నిప్రమాదం జరిగి విలువైన ఫైలు వస్తువులు కాలిపోవడంతో జరిగిన సంఘటనలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు ఇలాంటి ఇబ్బందులు కాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.