06-04-2025 04:16:58 PM
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని పాత పాల్వంచ శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ఆదివారం జరిగిన శ్రీరామనవమిని పురస్కరించుకొని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదము స్వీకరించారు.ఘన స్వాగతం పలికిన ఆలయ నిర్వహకులు వనమా వెంట కొత్వాల సత్యనారాయణ, బత్తుల నాగరాజు, ముక్తేవి ప్రసాద్, ఆలయ నిర్వహకులు సుంకర వీరభద్రరావు కొండపల్లి ప్రసాద్, కుసుమరాజుల కృష్ణ, నల్లకట్ల నవీన్, మొగిలి రామకృష్ణ, రొయ్యల కృష్ణయ్య, కూర ఫణి కుమార్ తదితరులు పాల్గొన్నారు