రంగారెడ్డి,(విజయక్రాంతి): కొడంగల్లో ఫార్మా కంపెనీల ఏర్పాటుకు వ్యతిరేకంగా, రుణమాఫీ పూర్తిగా చేయాలని కోరుతూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుందుకు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పాదయాత్ర చేపట్టారు. అయితే పట్నం నరేందర్రెడ్డి పాదయాత్రకు వెళ్లకుండా ఉండేందుకు మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డిని పోలీసులు బుధవారం అడ్డుకున్నారు. హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనిలో సబితా ఇంద్రారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సబితాను బయటకు రాకుండా ఇంటిముందు పోలీసులు మోహరించారు.