రంగారెడ్డి : కొడంగల్లో ఫార్మా కంపెనీల ఏర్పాటుకు వ్యతిరేకంగా, రుణమాఫీ పూర్తిగా చేయాలని కోరుతూ ప్రభుత్వం ఒత్తిడి పెంచెందుకు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి చేపట్టిన పాదయాత్రకు వెళ్లకుండా మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి గారిని పోలీసులు అడ్డుకున్నారు. బుధవారం నగరంలోని శ్రీనగర్ కాలనిలో సబితా ఇంద్రారెడ్డినీ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మాజీమంత్రిని బయటకు రాకుండా ఇంటిముందు పోలీసులు మోహరించారు.