గజ్వేల్,(విజయక్రాంతి): వ్యాపారం బాగా నడుస్తుందా అంటూ రాజీవ్ రహదారిపై పాతూరు మార్కెట్ లో వ్యాపారులను మాజీ మంత్రి హరీష్ రావు ఆప్యాయంగా పలకరించారు. బుధవారం రాత్రి సిద్దిపేట నుంచి హైదరాబాద్ వెళ్తుండగా మార్గమధ్యలో పాతూరు కూరగాయల మార్కెట్ను మాజీ మంత్రి హరీశ్రావు సందర్శించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మహిళ వ్యాపారుల దగ్గరికెళ్లి ఆప్యాయంగా పలకరించారు. వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. వారి వద్ద కూరగాయలు కొనుగోలు చేశారు. గతంలో తామంత రోడ్డుపై కూరగాయలు విక్రయించే వారిమని, ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, ఇబ్బందులు పడ్డామని, ఇప్పుడు మంచిగా వ్యాపారం చేసుకుంటున్నామన్నారు. హరీష్ రావు చొరవ వల్లే మార్కెట్ నిర్మాణం జరిగి తాము పండించిన కూరగాయలతో పాటు ఇతర రైతుల కూరగాయలు కూడా అమ్ముకుంటున్నామని ఆనందం వ్యక్తం చేశారు. హరీష్ రావు మార్కెట్ కు రావడంతో కూరగాయల వ్యాపారులంతా వారితో సెల్ఫీ దిగారు. హరీష్ రావే స్వయంగా సెల్ఫీ ఫోటో తీశారు.