07-04-2025 12:38:20 AM
మహబూబ్ నగర్ ఏప్రిల్ 6 (విజయ క్రాంతి) : వేసవి తాపం నుంచి ట్రాఫిక్ పోలీసులకు ఉపశమనం కలిగించేందుకుగాను మాజీ కౌన్సిలర్ మూష నరేందర్ నాణ్యత కూడిన కూలింగ్ గ్లాసెస్ ను అందజేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ పోలీస్ కార్యాలయంలో ట్రాఫిక్ పోలీసులకు ఈ కూలింగ్ గ్లాసులను అందజేశారు.
ప్రస్తుతం ఉన్న వేసిన దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ పోలీసులకు తోచిన సహాయం చేయడం అభినందనీయమని డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ మూష నరేందర్ కు పోలీస్ సిబ్బంది ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ సేవతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, తదితరులు ఉన్నారు.