calender_icon.png 27 October, 2024 | 8:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ ఇంద్రసేన్ రెడ్డి కన్నుమూత

27-10-2024 05:02:18 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ ఇంద్రసేన్ రెడ్డి కన్నుమూశారు. యువజన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఇంద్రసేన్ రెడ్డి అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆయన తెలంగాణ మలిదశ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఇంద్రసేన్ రెడ్డి మృతిపట్ల కాంగ్రెస్ నేతలు సంతాపం తెలిపారు.