శేరిలింగంపల్లి, అక్టోబర్ 2: నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన కేసులో పరకాల మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు చల్లా ధర్మారెడ్డిపై మాదాపూర్ పోలీసులు ఫోర్జరీ కేసు నమోదు చేశారు. ఈ మేరకు విజన్ రిసార్ట్స్ పార్ట్నర్ రాజశేఖర్ బుధవారం చల్లా ధర్మారెడ్డి, రియల్టర్ పురుషోత్తం నాయుడుపై మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తన స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లలో ధర్మారెడ్డి, పురుషోత్తం నాయుడు తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని, తనను చంపుతామని బెదిరించారని గంట రాజశేఖర్ పోలీసు లకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా తన ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యులను సైతం బెదిరింపులకు గురి చేశారని ఆరోపించాడు. దీనిపై జీరో ఎఫ్ఐఆర్ నమో దు చేసిన మాదాపూర్ పోలీసులు కేసును శంషాబాద్ పోలీసు స్టేషన్కు బదిలీ చేసినట్లు సమాచారం.