calender_icon.png 9 February, 2025 | 2:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాజాదనం కోసం..

09-02-2025 12:15:04 AM

ప్రకాశవంతమైన లైట్ల వెలుగులో పనిచేస్తే కష్టపడి చూడాల్సి ఉంటుంది. దీంతో కళ్లు త్వరగా, బాగా అలసిపోతాయి. కాబట్టి తగినంత వెలుతురు ఉండేలా చూసుకోవాలి. ఎక్కువసేపు డిజిటల్ పరికాలను చూడటం వల్ల కళ్లు ఒత్తిడికి గురవుతాయని అంటున్నారు నిపుణులు.. అలాంటివారు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి..

తల మీద నేరుగా కాంతి పడినా, కిటికీ నుంచి ప్రకాశవంతమైన ఎండ పడినా తెరను చూసేటప్పుడు కళ్లకు ఇబ్బంది కలుగుతుంది. వీలైతే ఫ్లోర్ ల్యాంప్స్ అమర్చుకోవాలి. 

ఒకవేళ కిటికీ తెరవడం తప్పనిసరైతే పక్కవైపు నుంచి కాంతి పడేలా చూసుకోవాలి. కిటికీకి ఎదురుగా గానీ కిటికీకి వీపు చేసి గానీ కూర్చోవద్దు. కర్టెన్లు వేస్తే బయటి వెలుగు తగ్గించుకోవచ్చు. 

డిస్‌ప్లే మీద యాంటీ గ్లేర్ స్క్రీన్ బిగిస్తే కళ్లకు హాయిగా ఉంటుంది. ఒకవేళ కళ్లద్దాలు ధరిస్తే యాంటీ రిఫ్లెక్టింగ్ ఉన్న గ్లాసెస్ ఎంచుకోవాలి. 

అదేపనిగా కంప్యూటర్‌ను చూడటం మంచిది కాదు. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి పక్కకు తిరిగి 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువులను కనీసం 20 సెకండ్ల పాటు చూడాలి. దీంతో కంట్లోని కండరాలు వదులవుతాయి. అలసట తగ్గుతుంది. 

చేసేపని నుంచి తరచూ విరామం తీసుకోవాలి. ప్రతి గంటకూ కనీసం 10 నిమిషాల సేపు విశ్రాంతి తీసుకుంటే మంచిది. కంప్యూటర్ మీద పనిచేయడం వల్ల తలెత్తే మెడ, వీపు, భుజాల నొప్పి తగ్గటానికిది తోడ్పడుతుంది. కళ్ల మీద ఒత్తిడిని తగ్గిస్తుంది.