29-03-2025 07:30:14 PM
మేడ్చల్ (విజయక్రాంతి): మేడ్చల్ పట్టణంలోని ఏడుగుళ్ల అమ్మవారి ఆలయ ప్రాంగణంలో శ్రీపాద వల్లభా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి అమావాస్య రోజున 300 మందికి అన్నదానం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ తాళ్లపల్లి రమేష్ గుప్తా, నరేంద్ర చారి, నర్సింలు పటేల్, సంతోష్ గుప్తా, నర్సింగరావు, జంలాల్ నాయక్, శేఖర్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.