గజ్వేల్ (విజయక్రాంతి): వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ ను పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని గజ్వేల్ ట్రాఫిక్ సిఐ మురళి అన్నారు. సోమవారం క్షీరసాగర్ హంస హోమియోపతి మెడికల్ కళాశాల విద్యార్థులతో కలిసి గజ్వేల్ లో వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు ప్రయాణంలో తప్పనిసరిగా హెల్మెట్ ను ధరించాలని, ట్రాఫిక్ రూల్స్ కు అనుగుణంగా వాహనాలను నడపాలని సూచించారు.
వాహనాలపై ప్రయాణించేటప్పుడు అతివేగం పనికిరాదని, కుటుంబ సభ్యులకు దృష్టిలో ఉంచుకొని వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపినా, లైసెన్స్ లేకుండా, మైనర్లకు వాహనాలు ఇచ్చిన వారిపై కేసులో నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులు యువత వాహనదారుల్లో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో విద్యార్థులు, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.