19-03-2025 02:29:28 AM
చెన్నూరు ఏడీఏ బానోత్ ప్రసాద్
మందమర్రి మార్చి 18 : మండలంలోని పుచ్చ సాగు చేస్తున్న రైతులు సాగులో మెలకువలు పాటించి అధిక దిగుబడి సాధించాలని చెన్నూరు వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు భాను ప్రసాద్ అన్నారు. మండలంలోని మందమర్రి(వి) శివారు బురుదగూడెంకు చెందిన యువరైతు చరణ్ సాగు చేస్తున్న పుచ్చకాయ క్షేత్రాన్ని మండల వ్యవసాయ అధికారి కిరణ్మయితో కలిసి సందర్శించారు.
ఈ సందర్బంగా పుచ్చకాయ విత్తనం వేయకముందు బాగా దుక్కి చేసి పశువుల ఎరువు వేసుకోవాలని, ఆరు ఇంచుల ఎత్తులో బెడ్లు తయారు చేసుకోవాలని, సమతుల ఎరువుల విధానాన్ని పాటించి సరైన నీటి యాజమాన్య పద్ధతులు పాటించాలని సూచించారు.
పుచ్ఛలో రసం పీల్చు పురుగుల నివారణకు డైనోట్ ఫురాన్ వంటి మందులు ఎకరానికి 100 గ్రాములు, ముఖ్యంగా కలుపు లేకుండా చేసి సూక్స్మ దాతు లోప నివారణకు ఫార్ములా 4 వంటి మందులు రెండు మూడు సార్లు అందించాలని సూచించారు. పుచ్చలో బోరాన్ లోపం ఎక్కువగా ఉంటుందని, బోరాన్ లోపం వలన కాయలు వంకర టింకరలుగా ఏర్పడి పగిలి పోయి నాణ్యత దెబ్బతింటుం దన్నారు.
లోప నివారణకు బోరాన్ 2గ్రాములు లీటరు నీటికి కలిపి రెండు మూడు దఫాలు పై పాటుగా పిచికారీ చేసుకోవాలని ఆన్నారు. ఈ కార్యక్రమంలో ఏఓ కిరణ్మయి, ఏఈఓ లు ముత్యం తిరుపతి, సయిండ్ల కనకరాజు, మండల పరిధిలోని సారంగపల్లి, పొన్నారం, మామిడిగట్టు, చిర్రకుంట,ఆదిల్ పేట్ గ్రామాల రైతులు పాల్గొన్నారు.
మందమర్రి మండలంలోని సండ్రోన్ పల్లి రైతు వేదికలో రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు పంట మార్పిడి చేయాలని, ఆయిల్ పామ్ సాగుకై మొగ్గు చూపాలని, ఇది ఒక్కసారి నాటితే ముప్పు సంవత్సరాల వరకు పంటనిస్తుందన్నారు.
మొదటి నాలుగు సంవత్సరాలు అంతర పంటలుగా పత్తి, పప్పు ధాన్యాల వంటివి సాగు చేసుకొని అదనపు ఆదాయం పొందవచ్చన్నారు. కార్యక్రమంలో ఏఓ కిరణ్మయి, ఏఈఓ లు ముత్యం తిరుపతి, సయిండ్ల కనకరాజు, మండల పరిధిలోని సారంగపల్లి, పొన్నారం, మామిడిగట్టు, చిర్రకుంట, ఆదిల్ పేట్ గ్రామాల రైతులు పాల్గొన్నారు.