స్పెషల్ డ్రైవ్ చేపట్టిన రైల్వేశాఖ
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: పండగల సీజన్ నేపథ్యంలో టికెట్ లేకుండా ప్రయాణించే వారికి చెక్ పెట్టేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఇందులో భాగం గా అక్టోబర్ 1 నుంచి 15 వరకు, అక్టోబర్ 25 నుంచి నవంబర్ 10 వరకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని 17 జోన్ల జనరల్ మేనేజర్లకు రైల్వేశాఖ లేఖలు రాసింది. టికెట్ లేకుండా ప్రయాణించే వారిలో పోలీసులూ ఎక్కువగా ఉన్నట్లు రైల్వే కమర్షియల్ అధికారు లు వెల్లడించారు. ఇటీవల ఘజియాబాద్ సెక్షన్లో తనిఖీలు చేపట్టగా.. వివిధ రైళ్లలోని ఏసీ కోచ్లలో వందలాది మంది పోలీసులు టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. వారందరికీ జరిమానా విధించినట్లు అధికారులు వెల్లడించా రు. కాగా 2023 ఆర్థిక సంవత్సరంలో 3.61 కోట్ల మంది టికెట్ లేకుం డా పట్టుబడగా, వారి నుంచి జరిమా నా రూపంలో భారతీయ రైల్వే రూ. 2,231 కోట్లు వసూలు చేసింది.