ఏపీలోని నర్సాపూర్ పార్లమెంట్ సభ్యుడు, కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మను ఎఫ్ఎన్సీసీ కార్యవర్గం ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసింది. అనంతరం ఆయన్ను సత్కరించింది. ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి మాట్లాడుతూ.. ఫిల్మ్నగర్ క్లబ్కు ఎప్పుడు ఏ సహాయం కావాల న్నా అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమం లో సీనియర్ నటుడు మురళీమోహన్, సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ, తెలుగు ఫిల్మ్ చాంబర్ సెక్రెటరీ దామోద్ ప్రసాద్, తెలుగు నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్నకుమార్, ఎఫ్ఎన్సీసీ సెక్రెటరీ ముళ్లపూడి మోహన్రెడ్డి, జాయింట్ సెక్రెటరీ వీవీఎస్ఎస్ పెద్దిరాజు, ట్రెజరర్ బి.రాజశేఖర్రెడ్డి, జె.బాలరాజు, ఏడిద రాజా, సామా ఇంద్రపాల్రెడ్డి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.