బెంగళూరు, అక్టోబర్ 15: ప్రయాణికుల సౌకర్యార్థం బెంగళూరులోని కెంపెగౌడ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎగిరే ట్యాక్సీలను అందుబాటులోకి తీసుకురానుంది. వాతావరణ కాలుష్యం, ట్రాఫిక్ రద్దీ లేకుం డా తక్కువ ఎత్తులో ప్రయాణ సేవలు అం దించేందుకు నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం సార్లా ఏవియేషన్తో ఒప్పందం కుదిరినట్లు ఎక్స్ వేదికగా వెల్లడించింది.
సార్లా ఏవియేషన్ సీఈఓ అడ్రియన్ స్మిత్ మాట్లాడుతూ.. ప్రస్తుతం బెంగళూరులోని ఇందరా నగర్ నుంచి విమానాశ్రయానికి చేరుకునేందుకు గంటా 50 నిమిషాలు పడుతుందని, ఎగిరే టాక్సీలు అందుబాటులోకి వస్తే కేవలం 5 నిమిషాల్లోనే గమ్యాన్ని చేరుకోవచ్చని వెల్లడించారు. కాగా ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. సేవలు అందుబాటులోకి వచ్చేందుకు 2 నుంచి 3 సంవత్సరాలు పడుతుంది.