calender_icon.png 6 October, 2024 | 8:10 AM

మేఘాలయలో వరద బీభత్సం

06-10-2024 01:22:40 AM

కొండచరియలు విరిగిపడి 10మంది మృతి

షిల్లాంగ్, అక్టోబర్ 5: మేఘాలయలోని గారో హిల్స్ ప్రాంతంలో గత 24గంటలుగా కురుస్తున్న భారీ వర్షాలతో వరద పోటెత్తడంతో పాటు కొండచరియలు విరిగిపడుతున్నాయి. శనివారం సాయంత్రం వరకు వరదల కారణంగా 10 మంది చనిపోయారని అధికారిక సమాచారం. కాగా కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతు ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.  కాగా గారోహిల్స్‌లోని వరద పరిస్థితిని సీఎం సంగ్మా సమీక్షించారు.  మునపెన్నడూ లేనివిధంగా వరదలు సంభవిం చడంతో కొండచరియలు విరిగిపడటంతో పాటు వంతెనలు, ప్రధాన రోడ్లు కొట్టుకుపోయాయి.