కొండచరియలు విరిగిపడి 10మంది మృతి
షిల్లాంగ్, అక్టోబర్ 5: మేఘాలయలోని గారో హిల్స్ ప్రాంతంలో గత 24గంటలుగా కురుస్తున్న భారీ వర్షాలతో వరద పోటెత్తడంతో పాటు కొండచరియలు విరిగిపడుతున్నాయి. శనివారం సాయంత్రం వరకు వరదల కారణంగా 10 మంది చనిపోయారని అధికారిక సమాచారం. కాగా కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతు ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కాగా గారోహిల్స్లోని వరద పరిస్థితిని సీఎం సంగ్మా సమీక్షించారు. మునపెన్నడూ లేనివిధంగా వరదలు సంభవిం చడంతో కొండచరియలు విరిగిపడటంతో పాటు వంతెనలు, ప్రధాన రోడ్లు కొట్టుకుపోయాయి.