18-03-2025 05:17:45 PM
ఆదిలాబాద్ (విజయక్రాంతి): దళితులకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ పెద్దపీట వేసి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్ ని స్వీకర్ ను చేస్తే బీఆర్ఎస్ దురంహకారంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ ని అవమానించేలా వ్యాఖ్యలు చేసిన మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫ్లెక్సీని దహనం చేసిన కాంగ్రెస్ శ్రేణులు నిరసన నినాదాలతో హోరెత్తించాయి.