కామారెడ్డి, అక్టోబర్ 2౩ (విజయక్రాంతి): స్వంత తమ్ముడిని హత్య చేసిన అన్నకు ఐదేళ్ల జైలుశిక్షతోపాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ కామారెడ్డి జిల్లా మొదటి అదనపు జడ్జి లాల్సింగ్ శ్రీనివాస్నాయక్ బుధవారం తీర్పునిచ్చారు. కామారెడ్డి జిల్లా నస్రూల్లాబాద్ మండలానికి చెందిన అల్లం ప్రభాకర్ మద్యానికి బానిసై తమ్ముడు శివకుమార్ను డబ్బుల కోసం వేధించేవాడు.
డబ్బులు ఇవ్వకపోవడంతో మనుసు లో పెట్టుకున్న ప్రభాకర్ 2022 అక్టోబర్ ౧న శివకుమార్ను కట్టెతో కొట్టి చంపేశాడు. మృతుని తండ్రి అల్లం మధుకర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశా రు. కోర్టులో నేరం రుజువు కావడంతో నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్షతోపాటు రూ.౫ వేల జరిమానా విధిస్తూ కామారెడ్డి మొదటి అదనపు జిల్లా జడ్జి లాల్సింగ్ శ్రీనివాస్ నాయక్ తీర్పు ఇచ్చినట్టు ఎస్పీ సింధూశర్మ తెలిపారు.