calender_icon.png 25 September, 2024 | 9:55 PM

ఐదుగురు దోపిడీ దొంగల అరెస్ట్

25-09-2024 12:55:22 AM

సూర్యాపేట, సెప్టెంబర్ 24: ఐదుగురు దోడిపీ దొంగలను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్ జిల్లా పోలీస్ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 19న మేళ్లచెరువు మండ లం వెల్లటూరు గ్రామంలో తమ్మిశెట్టి వెంక య్య ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి ఇంట్లోవారిని బెదిరించి 6.5 తులాల బ ంగారం, 30 తులాల వెండి, రూ.50 వేల న గదును ఎత్తుకెళ్లారు.

స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదయింది. కోదాడ రూరల్ సీఐ రజితారెడ్డి అనంతగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా కారులో అనుమానాస్పదంగా ఐదుగురు నిందితులను విచారించగా దోపిడీ చేసింది వారేనని తేలింది. వారిలో ఏపీలోని ఎన్‌టీఆర్ జిల్లాకు చెందిన వేమవరపు నాగరాజు, వేమవరపు పుల్లారావు, బిక్షాలు, నల్లగొండ జిల్లాకు చెందిన రమావత్ మాతృ, నాగర్‌కర్నూలుకు చెందిన చిక్కల ఆంజనేయులు ఉన్నారు. వారిని అరెస్టు చేసి, 6.5 తులాల బంగారం, 30 తులాల వెండి, కారును స్వాధీనం చేసుకున్నారు.