calender_icon.png 5 October, 2024 | 8:48 PM

టీఎన్జీవో ఆద్వర్యంలో బతుకమ్మ సంబరాలు.. నగరపాలక సంస్థకు ప్రథమ బహుమతి

05-10-2024 05:39:20 PM

బతుకమ్మ వేడుకల్లో పాల్గొని బహుమతి సాధించిన మహిళ ఉద్యోగులను అభినందించిన మేయర్ యాదగిరి సునీల్ రావు, కమీషనర్ చాహాత్ బాజ్ పాయ్

కరీంనగర్ :  తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సాంప్రదాయ పండగ అయిన బతుకమ్మ వేడుకను పురస్కరించుకొని కరీంనగర్ లో టీఎన్జీవో సంఘం బతుకమ్మ సంబరాల పోటీలను నిర్వహించింది. ఈ పోటీల్లో నగరపాలక సంస్థకు చెందిన మహిళ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొని తీరోక్క పూలతో బతుకమ్మను పేర్చి... ఉయ్యాల పాటలతో ఆడి పాడుతూ సంబరాల పోటీల్లో పాల్గొన్నారు. దీంతో టీఎన్జీవో సంఘం నగరపాలక సంస్థ కార్యాలయానికి మొదటి బహుమతిని ప్రకటించి అందించింది. దీంతో శనివారం రోజు మహిళ అధికారులు, సిబ్బంది నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్ యాదగిరి సునీల్ రావు, కమీషనర్ చాహాత్ బాజ్ పాయ్ ని కలిశారు. మేయర్ యాదగిరి సునీల్ రావు, కమీషనర్ చాహాత్ బాజ్ పాయ్ బతుకమ్మ సంబరాల్లో మొదటి బహుమతి సాధించిన మహిళ ఉద్యోగులను అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమీషనర్ సువార్త, డిప్యూటీ కమీషనర్ స్వరూప రాణీ మహిళ ఉద్యోగులు పాల్గొన్నారు