calender_icon.png 28 October, 2024 | 1:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్‌కు తొలి మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ కిరీటం

28-10-2024 12:00:00 AM

గ్రాండ్ పీజెంట్ పోటీల్లో రేచల్ గుప్తాకు గోల్డెన్ క్రౌన్

బ్యాంకాక్, అక్టోబర్ 27: పంజాబ్‌కు చెందిన రేచల్‌గుప్తా ప్రతిష్ఠాత్మక మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ కిరీటాన్ని అందుకున్నారు. బ్యాంకాక్‌లో జరిగిన ఈ పోటీల్లో 70 దేశాల సుందరీమణులు పాల్గొనగా వారందిరినీ వెనక్కు నెట్టి రేచల్ ఈ టైటిల్‌ను సాధించారు. మిస్ గ్రాండ్ కిరీటం సాధించిన తొలి భారతీయురాలిగా రేచల్ చరిత్ర సృష్టించారు.

గ్రాండ్ పీజెంట్ చాయిస్ అవార్డును కూడా గెలుచుకుని మిస్‌యూనివర్స్  లారాదత్తా సరసన నిలిచారు. ఈ ఏడాది ఆగస్టులో మిస్ గ్రాండ్ ఇండి యా టైటిల్ గెలుచుకున్న రేచల్.. ఇంటర్నేషనల్ పోటీలకు అర్హత సాధించారు. ఇప్పుడు గోల్డెన్ క్రౌన్ సాధించడంతో ప్రపంచశాంతి, స్థిరత్వంపై గ్లోబల్ అంబాసిడర్‌గా ఉంటారు.