calender_icon.png 3 February, 2025 | 4:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీబీఎస్‌తో అసోంలో తొలి మరణం

03-02-2025 01:30:38 AM

మహారాష్ట్రలో ఐదుకు చేరిన మృతుల సంఖ్య

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: గులియన్ బారే సిండ్రోమ్(జీబీఎస్) కారణంగా మహారాష్ట్రలో మరణించిన వారి సంఖ్య ఐదుకు చేరింది. ఇదే సమయంలో జీబీఎస్ బారిన పడిన వారి సంఖ్య 149కి చేరింది. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జీబీఎస్ కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే అసోంలో కూడా జీబీఎస్ కేసులు నమోదు కాగా శనివారం ఆ రాష్ట్రంలో తొలి మరణం నమోదైంది. జీబీఎస్ బారిన పడిన వారిలో సొంత రోగనిరోధక వ్యవస్థ శరీరంలోని నరాలపై దాడి చేస్తుంది.