అమ్మానాన్నలు వద్దని వారించినా సినిమాల కోసం ముంబయి చేరింది త్రిప్తి డిమ్రీ. తొలినాళ్లలో అవకాశాల కోసం అష్టకష్టాలు ఎదుర్కొన్న ఈ భామ ప్రస్తుతం తన సినిమాలతో ఆనందాన్ని పొందుతోంది. ప్రస్తుతం త్రిప్తి ‘విక్కీ విద్యా కా వో వాలా వీడియో’ చిత్రంలో నటిస్తోంది. ఇందులో నుంచి ఇటీవల విడుదలైన సాంగ్ తనకెంతో ప్రత్యేకం అంటూ ఆనందంగా చెబుతోంది. ‘మేరే మెహబూబ్’ అనే ఈ పాట..
సినిమా కోసం తాను చేసిన డ్యాన్స్ మొదటిదని అంటోంది. డ్యాన్స్ అంటే తనకు ఇష్టమని చెప్పే త్రిప్తి ఇందులో ఉత్సాహంగా నర్తించింది. నెటిజన్లు మాత్రం త్రిప్తిని ట్రోల్ చేస్తున్నారు. ‘స్ట్రీ2’ చిత్రంలో ‘ఆజ్ కీ రాత్’ పాటలోని తమన్నా భాటియాతో త్రిప్తిని పోల్చుతున్నారు. అక్టోబర్ 11న విడుదల కానుంది. కొరియోగ్రాఫర్ గణేశ్ మాస్టర్ నేతత్వంలోని సచిన్- జిగర్, శిల్పారావ్, సచేత్ టాండన్ వంటి ప్రఖ్యాత కళాకారులతో కలిసి పనిచేసినందుకు ఆనందంగా ఉందని చెప్తోంది త్రిప్తి డిమ్రీ.