calender_icon.png 20 October, 2024 | 6:31 PM

ప్రభుత్వాసుపత్రిలో అగ్నిప్రమాదం.. పరుగులు పెట్టిన రోగులు

20-10-2024 01:40:47 PM

నిర్మల్: నిర్మల్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుదాఘాతంతో భారీగా మంటలు చెలరేగాయి. ఆసుపత్రి మొదటి అంతస్తు పొగతో నిండిపోయింది. దీంతో ఆస్పత్రి నుంచి రోగులు, సిబ్బంది బయటకు పరుగులు తీశారు. స్థానికుల సమాచారంతో హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ప్రమాదంలో ఎంత ఆస్తినష్టం వాటిల్లిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.