25-04-2025 12:00:00 AM
రెండు కార్లు దగ్ధం
కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 24: బాచుపల్లిలోని మహీంద్రా సర్వీస్ మోటర్స్లో గురువారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. బాచుపల్లి రేణుకా ఎల్లమ్మ కాలనీని ఆనుకుని మియాపూర్ హైవేపై భారీ షెడ్ నిర్మించి అందు లో టాటా మోటర్స్, మహీంద్రా మోటర్స్ సర్వీస్ స్టేషన్లు నిర్వహిస్తున్నారు.
అగ్ని ప్రమా దం జరిగి మహీంద్రా కంపెనీకీ చెందిన రెండు కార్లు పూర్తిగా దగ్ధం కాగా, ఇతర సామగ్రి కాలిపోయింది. సర్వీస్ కోసం ఇచ్చిన వినియోగ దారుల వాహనాలు దగ్ధమైనా ఆ కార్ల యజమానులకు సర్వీస్ స్టేషన్ నిర్వాహకులు నిర్లక్ష్యం గా సమాధానం చెప్పడంతో కస్టమర్స్కు నిర్వాహకులకు వాగ్వాదం జరిగింది.