calender_icon.png 23 September, 2024 | 1:49 AM

యాదాద్రిలో భారీ అగ్ని ప్రమాదం

11-07-2024 12:54:14 PM

యాదాద్రి: ఎరువుల పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం సంభవించిన ఘటన యాదాద్రి జిల్లాలో ధర్మోజిగూడెం శివారు ఓజో ఎరువుల పరిశ్రమలో గురువారం తెల్లవారుజామున సంభవించింది. దట్టమైన పొగలు రావడంతో ఎల్లం భావి, చుట్టుపక్కల గ్రామాల వాసులు భయాందోళనకు గురయ్యారు. ఫర్టిలైజర్ కంపెనీలో తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. చౌటుప్పల్ నుంచి ఆరు అగ్నిమాపక యంత్రాలు వెంటనే వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. అదృష్టవశాత్తూ, మంటలు వ్యాపించకముందే కార్మికులు ప్రాంగణాన్ని ఖాళీ చేయడంతో ఎటువంటి గాయాలు సంభవించలేదు. ఈ అగ్నిప్రమాదంలో సుమారు రూ.30 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.