హైదరాబాద్: పంజాగుట్ట ప్రజాభవన్ కు సమీపంలోని పెట్రోల్ బంకులో అగ్నిప్రమాదం సంభవించింది. భూగర్భ ట్యాంక్ మూత తీస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీగా మంటలు రావడంతో ప్రజలు పరుగులు తీశారు. గమనించిన పెట్రోల్ బంక్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.