28-04-2025 09:20:44 AM
హైదరాబాద్: నల్గొండ జిల్లాలోని యాదాద్రి పవర్ ప్లాంటు(Yadadri Power Plant)లో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. దామచర్ల మండలం వీర్లపాలెంలోని పవర్ ప్లాంటులో మంటలు అంటుకున్నాయి. యూనిట్-1 బాయిలర్ లో ఆయిల్ లీకై పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. వచ్చేనెల యూనిట్-1 ప్రారంభానికి అధికారులు ట్రయల్ రన్ చేస్తున్నారు. యూనిట్-1 ట్రయల్ రన్(Unit-1 Trial Run) సమయంలో మంటలు చెలరేగినట్లు సమాచారం. సకాలంలో మంటలు ఆర్పడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.