సంగారెడ్డి,(విజయక్రాంతి): బీఆర్ఎస్ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పటాన్ చెరు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. యాదాద్రి ఆయలంలో రీల్స్ చేశారని కౌశిక్ రెడ్డిపై విశ్వహిందు పరిషత్ (వీహెచ్పీ) నేత సుభాష్ చంద్ర ఫిర్యాదు చేయడంతో పటాన్ చెరు పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా కౌశిక్ రెడ్డి వ్యవహారించారని, దీంతో ఆయనపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, శేరిలింగపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో వివాదం జరిగిన సమయంలో కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైన విషయం తెలిసిందే.