15-04-2025 10:05:09 PM
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో పలువురు వ్యక్తులకు జరిమానా విదిస్తూ కొత్తగూడెం స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ మెండు రాజమల్లు మంగళవారం తీర్పు చెప్పారు. కేసుల వివరాలు ఇలా... పాల్వంచ టౌన్ ఎస్ఐ డి. రాఘవయ్య వాహన తనిఖీ చేయుచుండగా ఇద్దరు వ్యక్తులు అతిగా మద్యం తాగి వాహనం నడుపుచుండగా వారిని ఆపి బ్రీత్ ఎనలైజర్ ద్వారా పరీక్షించగా అతిగా మద్యం త్రాగినట్లు రికార్డు నమోదు కావడంతో వారిని కోర్టులో ప్రవేశపెట్టారు. వారిరువురికి రెండు కేసులలో జరిమానా చెల్లించారు. లక్ష్మీదేవిపల్లి ఎస్సై జి. రమణారెడ్డి వాహన తనిఖీ చేయుచుండగా నలుగురు వ్యక్తులను బ్రీత్ ఎనలైజర్ ద్వారా పరీక్షించగా మద్యం త్రాగినట్టు రుజువు కాగా కోర్టులో ప్రవేశపెట్టగా నలుగురికి జరిమానా విధించారు. మొత్తం ఆరుగురికి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.