రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్
హైదరాబాద్, సెప్టెంబర్ 11 (విజయక్రాం తి): సాంకేతికత మెరుగుదల కోసం కంపెనీలకు ఆర్థిక తోడ్పాటునందించే స్థాయికి తెలంగాణ ఎదుగుతున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయే ష్ రంజన్ కొనియాడారు. ‘జాతీయ భద్రతకు కొత్త మార్గాల అన్వేషణ’ అనే అంశంపై బుధవారం హైదరాబాద్లో సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్షణ, ఏరోస్పేస్ రంగాల సదస్సులో ఆయన మాట్లాడారు. సీఐఐ చైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయిప్రసాద్ మాట్లాడుతూ.. డిఫెన్స్ రంగానికి సంబంధించి ప్రత్యేక పాలసీ తీసుకురావాలని, పాలసీ రూపకల్పనపై ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు.