20-03-2025 12:52:31 AM
మహబూబ్ నగర్ మార్చి 19 (విజయ క్రాంతి) : పాలమూరు యూనివర్సిటీలో ఫార్మసి కాలేజీలో బీఫార్మసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న నందిని అనే విద్యార్థిని కామెర్లు, థైరాయిడ్ సమస్యలతో బాధపడుతూ మృతి చెందింది.ఈ విషయం తెలు సుకున్న పీ యూ అధికారులు ఆమె కుటుం బ సభ్యులను ఓదార్చి, వారి కుటుంబ సభ్యులకు 25,000 లను ఆర్థిక సాయం అందించారు.
ఈ సందర్భంగా వీసీ జిఎన్ శ్రీనివాస్ మాట్లాడుతూ నందిని కుటుంబ సభ్యులను ఓదార్చి, అండగా ఉంటామని అన్నారు. వీసీ తో పాటు ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రవికాంత్ , వీసీపీఏ సూర్య నాయక్ తదితరులు ఉన్నారు.