calender_icon.png 19 April, 2025 | 6:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుపేద అంత్యక్రియలకు రూ.20 వేలు ఆర్థిక సహాయం

16-04-2025 04:29:32 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణ పరిధిలోని సామల వీరభద్రం అనే నిరుపేద అనారోగ్యంతో మంగళవారం రాత్రి మృతి చెందగా ఆయన అంత్యక్రియలకు కేసముద్రం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం 20 వేల రూపాయలను ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో  లయన్స్ క్లబ్ పాస్ట్ ప్రెసిడెంట్ బోగోజు నాగేశ్వరాచారి మాట్లాడుతూ.. క్లబ్ చైర్మన్ మామిడి అశోక్ ఆధ్వర్యంలో పేద కుటుంబానికి అండగా నిలిచేందుకు సభ్యులు ముందుకు రావడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యర్నం శ్రీరాములు, చింతా కరుణాకర్, పరాంకుశం శ్రీహరి, రాపాక కుమారస్వామి, రుద్ర శ్రీకాంత్, చెలమల్ల కిరణ్, కంచు సురేందర్ తదితరులు పాల్గొన్నారు.