calender_icon.png 13 February, 2025 | 8:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్యాన్సర్ బాధితుడికి ఆర్థిక సాయం

13-02-2025 12:00:00 AM

కూసుమంచి, ఫిబ్రవరి 12 : ఖమ్మం రూరల్ మండలం ఏం వెంకటాయపాలెంకి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రెంటాల.రమేష్ ఇటీవల  క్యాన్సర్ కు గురై హైదరాబాద్ లోని యశోదా హాస్పిటల్ లో చికిత్స పొంది, ఏం.వెంకటాయపాలెంలోని తన స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలుసుకొని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్ దృష్టికి రాగ, వెంటనే స్పందించి వారి ఇంటికి వెళ్లి బాధితుడిని పరామర్శించి,ఆర్ధిక సహాయం అందజేశారు. 

వారి కుటుంబానికి  మనోధైర్యం చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా మీకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పాలేరు నియోజకవర్గ ఆత్మ కమిటీ డైరెక్టర్ నాగార్జునపు.ప్రద్యుమ్న చారి, ఎదులాపురం మున్సిపల్  నాయకులు కళ్లెం.శేష్ రెడ్డి, ఖమ్మం రూరల్ మండల నాయకులు నాగండ్ల.ఉపేందర్, పాపిట్ల.శ్రీను, గ్రామ కాంగ్రెస్ నాయకులు సత్యనారాయణ, రాజ్ కుమార్, సురేష్, వెంకటేశ్వర్లు, యుగంధర్, సత్తార్ ఉన్నారు.