22-04-2025 12:21:02 AM
అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్
నిర్మల్ ఏప్రిల్ 21 (విజయక్రాంతి): రాజీ వ్ యువశక్తి పథకం కింద దరఖాస్తు చేసుకు న్న అభ్యర్థులకు యూనిట్ల మంజూరి గ్రౌండ్ చేసి ఉపాధి అవకాశాలను కల్పించాలని బ్యాంకర్లను జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ఆదేశించారు, సోమవారం కలెక్టర్ కార్యాలయంలో వచ్చిన దరఖాస్తులు మంజూరైన యూనిట్లు బ్యాంక్ రుణం తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిం చారు.
జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పట్టణాల్లో పెద్ద ఎత్తున దరఖాస్తు అని వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి అరులైన వారందరికీ రుణాలను అందించాలని అధికారులకు సూచించారు. పథకాల ఎంపికలో పూర్తిగా పారదర్శకత పాటించాలని యూనిట్ల నిర్వహణపై అవగాహన పెంచాలన్నారు. కార్యక్ర మంలో లీడ్ బ్యాంకు మేనేజర్ రాంగోపాల్ జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.