calender_icon.png 24 March, 2025 | 4:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

10,954 జీపీవో పోస్టులు ఆర్థిక శాఖ అనుమతులు

23-03-2025 01:21:56 AM

  1. వీఆర్‌వో, వీఆర్‌ఏలుగా పనిచేసిన వారితో భర్తీ
  2. ఉత్తర్వులు జారీచేసిన సందీప్ కుమార్ సుల్తానియా
  3. త్వరలో నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్, మార్చి 22 (విజయక్రాంతి): గ్రామ పరిపాలనను బలోపేతం చేయడానికి రెవెన్యూ శాఖలో 10,954 మంది గ్రామస్థాయి అధి కారుల (జీపీవో) భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా శనివా రం ఉత్తర్వులు జారీచేశారు.

ఇటీవల జీపీవో పోస్టుల నియామకానికి క్యాబినెట్ ఆమోదించిన విషయం తెలిసిందే. తాజాగా ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చింది. అయితే ఈ పోస్టులను గతంలో రెవెన్యూ శాఖలో వీఆర్‌వో, వీఆర్‌ఏలుగా పనిచేసినవారితో భర్తీచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది.