calender_icon.png 16 October, 2024 | 5:30 PM

ఎట్టకేలకు కాంట్రాక్ట్ కార్మికుల బోనస్ ఖాతాల్లో జమ

16-10-2024 03:35:07 PM

కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గం పరిధిలోని టేకులపల్లి మండలంలోని కోయగూడెం ఉపరితల గనిలో ఓబీ, కోల్ పనులు నిర్వహిస్తున్న ఎల్ఎస్ఎన్ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు ఎట్టకేలకు సింగరేణి ఇచ్చిన రూ.5వేల బోనస్ డబ్బులు వారి ఖాతాల్లో ఎల్ఎస్ఎన్ కంపెనీ జమ చేసింది. వాస్తవానికి సింగరేణి వ్యాపితంగా అన్ని ఏరియాల్లో కాంట్రాక్ట్ కార్మికులకు దసరాకు ముందే సింగరేణి బోనస్ (స్పెషల్ ఇన్సెంటివ్) అందజేశారు.

కేవలం కేఓసీలో మాత్రమే కాంట్రాక్ట్ కార్మికులకు ఆలస్యం గా బోనస్ ఇవ్వడం గమనార్హం. కార్మికులు ఈనెల 9న వివిధ యూనియన్ నాయకుల సహకారంతో రాత్రి విధులు బహిష్కరించి నిరసన తెలియజేస్తే 10న వేతనాలు వేశారు. దసరాకు ముందే సింగరేణి యాజమాన్యం 100 మస్టర్లు ఉన్న కాంట్రాక్టు కార్మికులందరికీ రూ.5వేలు చొప్పున బోనస్ నగ దుని ఎల్ఎస్ఎన్ కంపెనీకి ఇచ్చింది. అధికారుల పర్యవేక్షణ లోపం, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా కార్మికులకు పండుగ తరువాత బోనస్ డబ్బులు ఇవ్వడం గమనార్హం. ఇదిలా ఉండగా కేఓసీలోని కాంట్రాక్ట్ సంస్థ తమ కార్మికులకు వేతనంతో పాటు పండుగ బోనస్ కూడా ఇవ్వాల్సి ఉండగా నేటికీ ఇవ్వకపోవడం విశేషం.