calender_icon.png 22 October, 2024 | 5:10 PM

విడాముయర్చి చిత్రీకరణ పూర్తి

23-07-2024 12:05:00 AM

థ్రిల్లర్ సినిమాలతో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు తమిళ దర్శకుడు మగిళ్ తిరమేని. అజిత్ కథానాయకుడిగా ఆయన తెరకెక్కిస్తున్న చిత్రం ‘విడాముయర్చి’. త్రిష కథానాయికగా నటిస్తుండగా, అర్జున్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తయినట్టు చిత్ర వర్గాలు తెలిపాయి. గతంలో అజిత్, త్రిష, అర్జున్ కలిసి నటించిన ‘మంగాత’ (తెలుగులో గ్యాంబ్లర్) ఘన విజయం సాధించింది. ఫలితంగా మగిళ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపైనా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఆరవ్, రెజీనా కసాండ్ర, నిఖిల్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకి అనిరుధ్ సంగీత దర్శకుడు.

చిత్ర దర్శకుడితో వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్న ఎన్‌బీ శ్రీకాంత్ ఈ సినిమాకి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. దీపావళి రేసులో నిలువనున్న ఈ సినిమా శాటిలైట్ హక్కులు సన్ టీవీ సొంతం చేసుకోగా, ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ సినిమా చిత్రీకరణ ముగియటంతో అజిత్ తిరిగి మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సెట్స్‌కి పయనమవనున్నారు. 2025 సంక్రాంతికి సందడి చేయనున్న ఈ సినిమాకి రాక్‌స్టార్ దేవీశ్రీప్రసాద్ స్వరకర్త.