హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 17 (విజయక్రాంతి): నన్నే పోలీస్ స్టేషన్కు పిలుస్తావా అంటూ ఇన్స్పెక్టర్పై దాడికి పాల్పడ్డాడు ఓ సినీ నిర్మాత. ఈ ఘటన గురువారం ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో చోటుచేసుకుంది. దసరా సందర్భంగా తార్నాక హనుమాన్ నగర్లో ని స్పోర్ట్స్ స్కేర్ గేమింగ్ జోన్లో పలు అసాంఘిక కార్యక లాపాలు నిర్వహించారని పోలీసుల కు సమాచారం అందింది.
దీంతో విచారణ నిమిత్తం నిర్వాహకులను ఇన్స్పెక్టర్ ఓయూ పీఎస్కు పిలి చారు. ఈ క్రమంలో పార్టీ నిర్వాహ కుల్లో ఒకరైన టాలీవుడ్ నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ.. నన్నే పోలీస్ స్టేషన్కు పిలుస్తావా అంటూ తన అనుచరులతో కలిసి ఇన్స్పెక్టర్పై పోలీస్ స్టేషన్లోనే దాడికి దిగాడు. ఈ తతంగమం తా ఓయూ డివిజన్ ఏసీపీ జగన్, అడిషనల్ డీసీపీ నరస య్య ఎదుటే జరగినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.