వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోల్లో రవితేజ కూడా ఒకరు. ఆయన కెరీర్లో సూపర్ హిట్లు ఎన్నో! అయితే, ఇటీవల ‘మిస్టర్ బచ్చన్’ మిశ్రమ ఫలితాలు సాధించింది. కాగా, ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రవితేజ తన 75వ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత తమిళ దర్శకుడు సుందర్ సి.తో ఆయన ఓ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయన్నది టాక్. ఖుష్బూ ఈ చిత్రానికి నిర్మాత.
సుందర్ సి.కి తమిళనాట మంచి పేరుంది. థ్రిల్లర్ సినిమాలు, కామెడీ టచ్ ఉన్న సినిమాల్ని బాగా హ్యాండిల్ చేసే ఆయన దగ్గర ఓ పవర్ ఫుల్ కథ ఉందని, దాన్ని రవితేజతో చేయడానికి కొన్నాళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారట. చివరికి ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి సిద్ధం అయ్యిందని తెలుస్తోంది.
అన్నీ కుదిరితే రవితేజ 76వ సినిమా ఇదే అవుతుంది. ఇటీవల రవితేజ చేతికి గాయం అవ్వడంతో ఆయన షూటింగులకు బ్రేక్ ఇచ్చి విశ్రాంతి తీసుకొంటున్నారు. కోలుకొన్న తర్వాత సితార ఎంటర్టైన్మెంట్స్ సినిమాను ముందుగా పూర్తి చేస్తారు. ఆ తర్వాతే సుందర్ సి. సినిమా ముందుకు వెళ్తుంది.