calender_icon.png 22 September, 2024 | 4:16 AM

సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం అందజేసిన ఎఫ్‌ఎన్‌సీసీ

19-09-2024 03:40:08 PM

హైదరాబాద్: వరద బాధితుల సహాయార్థం హైదరాబాద్ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ ఎఫ్ఎన్ సీసీ తరఫున ముఖ్యమంత్రి సహాయ నిధికి 25 లక్షల రూపాయల విరాళం అందజేసింది. ఎఫ్ఎన్ సీసీ అధ్యక్షులు ఘట్టమనేని ఆదిశేషగిరి రావు ఇతర ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆ మేరకు చెక్కును అందించారు. బాధితుల సహాయం కోసం ప్రభుత్వ కార్యక్రమాలకు అండగా నిలిచినందుకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారిని అభినందించారు.