calender_icon.png 3 October, 2024 | 10:10 AM

వరద బాధితులకు భారీగా విరాళాలు ప్రకటించిన సినీరంగ ప్రముఖులు

03-09-2024 05:51:43 PM

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం తెలుగు సినీ రంగ ప్రముఖులు విరాళాలు అందిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయ నిధికి నందమూరి బాలకృష్ణ 50 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు. తన వంతు బాధ్యతగా బాధితుల సహాయర్థం విరాళం ఇస్తున్నాని, తెలుగు రాష్ట్రాలు సాదరణ పరిస్థితులు నెలకొన్నాలని, దేవుని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ రెండు రాష్ట్రాల సీఎం సహాయనిధికి చెరో 50 లక్షల చొప్పున విరాళం అందజేశారు. యువ నటుడు సిద్దు జొన్నలగడ్డ 15 లక్షల చొప్పున ఇస్తున్నట్లు తెలిపారు. దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాతలు రాధాకృష్ణ, నాగవంశీలు 25 లక్షల చొప్పున విరాళాలు ప్రకటించారు. విశ్వక్సేన్ నాయుడు 5 లక్షల చొప్పున అందిస్తున్నట్లు వెల్లడిచారు. ఏపీ సీఎం సహాయనిధికి వైజయంతి మూవీస్ అధినేత అశ్వినిదత్ 25 లక్షల విరాళం ప్రకటించారు.