20 మంది మృతి.. పదుల సంఖ్యలో గాయాలు
న్యూఢిల్లీ, జూలై 8: గాజాపై ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడింది. ఆకాశ, భూమార్గాల ద్వారా ముప్పేట దాడి చేయటంతో పాలస్తీనా ప్రజలు హాహాకారాలు చేశారు. క్షిపణి దాడుల్లో దాదాపు 20 మంది మరణించారని పాలస్తీనా వర్గాలు తెలిపాయి. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో అమాయక ప్రజలు గాయపడ్డారని వెల్లడించారు.