27-03-2025 12:20:58 AM
సీఐ శివప్రసాద్
కడ్తాల్, మార్చి 26 ( విజయ క్రాంతి ) : ఉగాది, రంజాన్ పండుగలు ప్రజలు ప్రశాం త వాతావరణంలో జరుపుకోవాలని కడ్తాల్ సీఐ శివప్రసాద్ సూచించారు. బుధవారం కడ్తాల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐ శివప్రసాద్ మాట్లాడుతూ రంజాన్ ఉగాది పర్వదినాలు ప్రజ లు సంతోషంగా జరుపుకోవాలని అందరూ ఐక్యంగా మెలగాలని ఈ ప్రాంతంలో హిందూ ముస్లింలు ఎంతో ఆప్యాయంగా ఉంటారని స్నేహపూర్వక వాతావరణం నెలకొని ఉంటుందని సీఐ తెలిపారు. .పండు గల సమయంలో ఇరువర్గాల నాయకులు ఒకరినొకరు గౌరవించు కుంటు పండుగలు జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీస్ కమిటీ సభ్యులు, రాజకీయ నాయకులు, ముస్లిం సోదరులు, పలువురు సభ్యులు పాల్గొన్నారు.