calender_icon.png 11 October, 2024 | 6:59 AM

పిడుగుపాటుకు మహిళా కూలీ మృతి

11-10-2024 12:36:51 AM

మరో ముగ్గురికి అస్వస్థత

నల్లగొండ జిల్లా అడవి దేవులపల్లిలో ఘటన

నల్లగొండ, అక్టోబర్ 10 (విజయక్రాంతి): పిడుగుపాటుకు మహిళా కూలీ తీవ్ర అస్వస్థతకు గురై మృతిచెందగా, మరో ముగ్గురు అస్వస్థత పాలైన ఘటన అడవి దేవులపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకున్నది. దామరచర్ల మండలం వీర్లపా లేనికి చెందిన పాతులోతు హనియా (45) గరువారం గ్రామానికి చెందిన మరో ఐదుగురు కూలీలతో కలిసి అడవిదేవులపల్లిలో వ్యవసాయ పనులకు వచ్చింది.

సాయంత్రం 4 గంట ల సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీవర్షం ప్రారం భమైంది. దీంతో హనియాతో పలువురు సమీపంలోని వేపచెట్టు కింద కు వెళ్లారు. ఈ క్రమంలో ఒక్కసారిగా చెట్టుపై పిడుగు పడింది. ఘటనలో హనియా తీవ్ర అస్వస్థతకు గురై అక్కడికక్కడే మృతిచెందింది.

మరో ము గ్గురు కూలీలు అస్వస్థతకు గురయ్యా రు. స్థానికులు కూలీలను మిర్యాలగూడ ఏరియా దవాఖానకు తరలిం చారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతు రాలి కుమారుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.