calender_icon.png 22 September, 2024 | 5:04 PM

40 అడుగుల మట్టి గణపతి నిమజ్జనం

22-09-2024 02:34:40 PM

వరంగల్,(విజయక్రాంతి): శ్రీ భద్రకాళి హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 40 అడుగుల మట్టి గణపతిని ఆదివారం నిమజ్జనం చేశారు. భద్రకాళి అర్చకులు శేషు, నిర్వాహకులు ఆకుతోట సంజీవ్ గణేశుడిని పాలతో అభిషేకం చేసి  అనంతరం ఫైర్ ఇంజన్లతో నిమజ్జనం జరిపారు. ప్రతిష్టించిన చోటే నిమజ్జనం చేస్తున్న బొజ్జ గణపయ్యను 15 రోజుల పాటు విశేష పూజలు అందుకున్నారు. గణపతిని ప్రతిష్టించిన వద్దే  వేదపండితుల వేదమంత్రోర్చనతో  మహా గణపతి ఫైర్ ఇంజన్ తో  గణపతి ఉత్సవ సమితి సభ్యులు నిమజ్జనం చేస్తున్నారు. మహా గణేశుడిని నిమజ్జనం చేస్తున్న నీటిని కాలువలోకి మళ్లీంచడంతో భక్తుల మనోభావాలను కింపరిచేల ఉన్నాయని కొందరూ తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.