10-02-2025 05:11:53 PM
నిర్మల్ (విజయక్రాంతి): ప్రజలకు ఏ సమస్య వచ్చినా పోలీసులకు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ జానకి అన్నారు. సోమవారం ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. వాటిని పరిష్కరిస్తామని వారికి భరోసా కల్పించారు. పోలీసులు మీకోసం పనిచేస్తున్నారని గుర్తు చేశారు.