calender_icon.png 18 October, 2024 | 10:00 AM

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలి

18-10-2024 12:26:07 AM

ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ర్యాలీ

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 17 (విజయక్రాంతి): పెండింగ్‌లోని ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్స్ బకాయిలను వెం టనే విడుదల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి టీ నాగరాజు, సహాయ కార్యదర్శి దామెర కిరణ్, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి అశోక్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం విద్యార్థులతో కలిసి నారాయణగూడ నుంచి వైఎంసీఏ వరకు ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. ఏడేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్స్ పూర్తి బకాయిలను చెల్లించకపోవడం వల్ల విద్యార్థులు, కాలేజీ యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాలేజీలు నడపలేక రాష్ట్రంలోని యాజమాన్యాలు తాళాలు వేసుకునే పరిస్థితి నెలకొందని అన్నారు.

దీంతో పేద, మధ్య తరగతి విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బకాయిలను వెంటనే విడుదల చేయాలని, లేదంటే ఆందోళనలను ఉధృతం చేస్తామన్నారు.  హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు లెనిన్, ఉపాధ్యక్షులు స్టాలిన్, నాగేందర్, ప్రశాంత్, చరణ్, నాయకులు సహన, భగత్‌శివ  పాల్గొన్నారు.