జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య
ముషీరాబాద్, అక్టోబర్ 15 : (విజయక్రాంతి): రాష్ట్రప్రభుత్వం పెండింగ్లో ఉన్న రూ.4 వేల కోట్ల ఫీజుల బకాయిలను వెంటనే కాలేజీ యాజమాన్యాలకు చెల్లించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్య క్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో మంగళవారం తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజెస్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
యాజమాన్యాలకు ఫీజులు చెల్లించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొం టున్నారన్నారు. కాలేజీ యాజమాన్యాలు కోర్సులు పూర్తి అయినా విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు. బకాయిలు విడుదల కాని పక్షంలో డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు నిరవధిక బంద్కు పిలుపు నిస్తాయని హెచ్చరించారు. సమావేశంలో వివిధ సంఘాల నాయకులు గుజ్జ కృష్ణ, డాక్టర్ బొజ్జ సూర్యనారాయణరెడ్డి, రామకృష్ణ, సుందర్రాజ్, రమణారెడ్డి, గొరిగె మల్లేష్, జిల్లపల్లి అంజి పాల్గొన్నారు.