అమరావతి: అనంతపురం జిల్లాలో సభ్య సమాజం సిగ్గుపడే ఘటన చోటుచేసుకుంది. నార్పల మండల కేంద్రంలో ఓ తండ్రి కుమారైను చంపి బావిలో పడేశాడు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని కన్న కూతురినే పొట్టనపెట్టుకున్నాడు. నిందితుడిని గణేష్ గా గుర్తించారు. రెండు రోజుల క్రితం పావని అనే చిన్నారి కనబడకుండా పోయింది. చుట్టుపక్కల వెతికిన దొరకక పోవడంతో కుమారై కనిపించట్లేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనుమానం వచ్చి తండ్రిని విచారించారు. తానే చంపి బావిలో పడేసినట్లు తండ్రి గణేష్ పోలీసుల ముందు నిజం ఒప్పుకున్నాడు. అనంతరం బాలిలోంచి చిన్నారిని బయట తీసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. చిన్నారిని ఎందుకు చంపాడన్న కోణంలో నిందితుడిని అరెస్టు చేసి విచారిస్తున్నారు.